Anathapur History - అనంతపురం జిల్లా చరిత్ర
రాష్ట్రంలో వైశాల్యములో అతి పెద్ద జిల్లా, తెలుగు అక్షర క్రమములో మొదటిది. అనంతపురం దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు చెందిన అతి పెద్ద జిల్లా మరియు ముఖ్య పట్టణము. అనంతపురం జిల్లా 1882లో బళ్లారి జిల్లా నుండి వేర్పాటు చేయబడినది. ఈ ప్రాంతము ప్రధానముగా వర్షాధారిత వ్యవసాయము. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిర్చి, నువ్వులు మరియు చెరుకు. పట్టు, సున్నపురాయి, ఇనుము, మరియు వజ్రాల త్రవ్వకము ముఖ్యమైన పరిశ్రమలు. స్వాతంత్రం వచ్చిన రోజులలో నిర్మించిన గడియారగోపురం నగరం మధ్యలో ఉండి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటుంది.